బాలీవుడ్ లవ్లీ కపుల్ కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా తల్లిదండ్రులు కాబోతున్నారని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇటీవల మెట్ గాలా 2025 ఈవెంట్కి కియారా బేబీ బంప్ తో హాజరై అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె గర్భిణీ అని వార్తలు ఇప్పటికే స్పష్టంగా తెలిసిపోయాయి.
అయితే ఇప్పుడు కొత్తగా కొన్ని బేబీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కియారా బెడ్పై పడుకొని పాపను తనపై పెట్టుకుని ఉన్నట్టుగా ఈ ఫోటోలు కనిపిస్తున్నాయి. పక్కనే భర్త సిద్దార్థ్ కూడా ఉన్నట్టు ఈ పిక్స్ లో చూపిస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు – “ఇప్పుడే బిడ్డకు జన్మనిచ్చిందా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కానీ అసలు విషయమేంటంటే – ఈ ఫోటోలు నిజమైనవే కావు. ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఎడిట్ చేసిన ఫోటోలు అవి. కొంతమంది నెటిజన్లు వీటిని నిజంగా నమ్మి షేర్ చేస్తుండగా, మరికొందరు మాత్రం ఫేక్ అని స్పష్టంగా చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ విషయంపై కియారా, సిద్దార్థ్ అధికారికంగా స్పందించలేదు. అయితే నెట్టింట ఈ ఫోటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.
అసలు బిడ్డకు జన్మనిచ్చే తేదీ ఎప్పుడు అనే విషయమై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అప్పటివరకు ఫ్యాన్స్ మాత్రం ఈ ఫేక్ ఫోటోలను నిజమని నమ్మవద్దని అంటున్నారు.