సమంత హీరోయిన్గా, నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సంచలన విజయం అందించిన ఉత్సాహంతో చిత్ర యూనిట్ వైజాగ్లో గ్రాండ్ సక్సెస్ మీట్ను నిర్వహించింది.
ఈ వేదికపై చిత్ర రచయిత, సమంత భర్త రాజ్ నిడిమోరు మాట్లాడుతూ.. మరో రెండేళ్లలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించారు. మొదట ఆయన ప్రేక్షకులను అడగ్గా, ఆడియన్స్ నుండి వచ్చిన భారీ రెస్పాన్స్ చూసి పార్ట్-2ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.
ఇప్పటికే తన మైండ్లో ఒక ఐడియా ఉందని, సేమ్ టీమ్తోనే ఈ సీక్వెల్ ఉంటుందని రాజ్ తెలిపారు. ఒక సినిమాకు పార్ట్-2 చేయాలనే ఇన్స్పిరేషన్ తనకు కలగడం ఇదే తొలిసారి అని, రాబోయే చిత్రం డబుల్ ఫన్, డబుల్ ఎక్సైట్మెంట్తో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
The publish మా ఇంటి బంగారం : సీక్వెల్ ప్రకటించిన మేకర్స్.. ఎప్పుడొస్తుంది అంటే..? first seemed on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Scores.
