పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సుమారు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన ఈ సినిమా.. సీక్వెల్ కోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ పార్ట్ 2 షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్లో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం,
మేకర్స్ ఈ సినిమాను వచ్చే ఏడాది (2025) ఆఖరున విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఇదే కనుక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్కు ఇది అతిపెద్ద పండగ అని చెప్పవచ్చు. కానీ, ఈ డెడ్లైన్ అందుకోవడం సాధ్యమేనా? అన్న సందేహం కూడా లేకపోలేదు. నిజానికి దర్శకుడు నాగ్ అశ్విన్ మొదటి పార్ట్ షూటింగ్ సమయంలోనే పార్ట్ 2 కి సంబంధించిన చాలా వరకు ప్రీ-ప్లాన్డ్ పనులను పూర్తి చేసేశారట. ఇప్పుడు కేవలం నటీనటుల డేట్స్ సెట్ చేసుకుని కీలక సన్నివేశాలను చిత్రీకరించడమే మిగిలి ఉంది. సినిమాలోని గ్రాఫిక్స్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయని టాక్. అంటే, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ స్టార్స్ తమ డేట్స్ను త్వరగా కేటాయిస్తే, వచ్చే ఏడాది చివర్లో ‘కల్కి 2’ థియేటర్లలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదు. మొత్తం మీద పార్ట్ 2 పై వస్తున్న ఈ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
