Mon. Jun 29th, 2026

మెగా హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటి గట్టు’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రోహిత్ కేపీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఫైనల్ షెడ్యూల్ తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. మెయిన్ లీడ్‌పై అత్యంత కీలకమైన, ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించేందుకు వీలుగా ప్రొడక్షన్ టీం హైదరాబాద్‌లో ఒక భారీ ప్రత్యేక సెట్‌ను నిర్మించింది. ప్రస్తుతం ఈ సెట్‌లోనే టాప్ టెక్నీషియన్ల సమక్షంలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ కెరీర్ డిఫైనింగ్ రోల్ కోసం సాయి దుర్గా తేజ్ సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. మునుపెన్నడూ చూడని విధంగా రా ఎనర్జీ, ఊరమాస్ అప్పీల్‌తో కూడిన లుక్‌లో ఆయన అలరించబోతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో మరింత హైప్ పెంచేలా ఒక టాప్ బాలీవుడ్ నటుడు కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ‘హను-మాన్’ వంటి గ్లోబల్ హిట్‌ను అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే పలు లొకేషన్లలో మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఫైనల్ షెడ్యూల్ అవ్వగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనుంది. ఈ ఏడాది డిసెంబర్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

The put up క్లైమాక్స్‌కు చేరుకున్న ‘సంబరాల ఏటి గట్టు’..! first gave the impression on Newest Telugu Film Information, Evaluations, OTT, OTT Evaluations, Rankings.