వేసవి సెలవులు ఉండే సమ్మర్ సీజన్ రిలీజ్ కు చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో “బ్రహ్మచారి” సినిమా మే 10 థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. పలు షార్ట్ ఫిలింస్ తో ఫేమ్ అయిన మల్లేశం ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అద్వితీయ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై రాంభూపాల్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండగా..నర్సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. “బ్రహ్మచారి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ..‘‘ ఏజ్ బార్ అవుతున్నా పెళ్లి కాని యువకులను సరదాగా పెళ్లి కాని ప్రసాద్ అని పిలుస్తుంటాం. మన సమాజంలో ప్రస్తుతం పెళ్లి కాని ప్రసాద్ లు ఎక్కువవుతున్నారు. సరైన ఉద్యోగం లేకపోవడం, ఆర్థిక పరిస్థితులు బాగాలేక వారికి పెళ్లిల్లు కావడం లేదు. ఇలాంటి ఓ యువకుడి కథే “బ్రహ్మచారి”. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు నేను సమాజంలో చూసిన ఎంతోమంది వ్యక్తులు, సందర్భాలు గుర్తొచ్చాయి. సినిమా అంతా సహజంగా ఉంటూ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని మే 10న నాలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం.’’ అని అన్నారు.