Prakash Raj Controversy: శ్రీరాముడిపై వ్యాఖ్యల వివాదంలో ప్రకాష్రాజ్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరిచారని.. హిందూ ధర్మాన్ని, శ్రీరాముడిని వెటకారం చేశానని అంటున్నారని ఓ వీడియోలో పేర్కొన్నారు. అన్ని ధర్మాలను ప్రేమించే తనకు ఆ అవసరం లేదన్నారు. ధర్మాన్ని అడ్డుపెట్టుకుని మతోన్మాదంతో కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అలాంటి వారు తన ప్రశ్నలకు బదులివ్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను హిందూ వ్యతిరేకినని, ధర్మ విరోధినని నిందిస్తున్నారంటూ వెల్లడించారు. త్వరలో వస్తానని.. తనపై నిందలు వేస్తున్న వారికి సమాధానం చెప్తా అని ప్రకాష్రాజ్ స్పష్టం చేశారు.
READ MORE: Israel: చైనా, పాకిస్థాన్ ఇజ్జత్ తీసిన ఇజ్రాయెల్.. ఇరాన్కు ఎంత ‘చెక్కు’ ఇచ్చారని సూటి ప్రశ్న!
ఇక నటుడు ప్రకాష్ రాజ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. తెలుగు సినిమాల్లో అనేక పాత్రల్లో నటించారయన. సినిమాల్లో క్యారెక్టర్లు వేరు. బయట ప్రకాష్ రాజ్ తీరు వేరేగా ఉంటుంది. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారాయన. ఇటీవల కేరళలో జరిగిన ఓ సాహిత్య ఉత్సవంలో ప్రకాష్రాజ్ మాట్లాడుతూ.. శ్రీరాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతం నుంచి వచ్చిన వలస కూలీలుగా అభివర్ణించారు. వారు దక్షిణాదిలో ఓ గిరిజనుడైన రావణుడి పొలంలోకి వెళ్లి పండ్లు దొంగిలించారని, ఆ విషయంలోనే వివాదం మొదలైందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ పండ్ల దొంగతనం వల్లే యుద్ధం జరిగిందన్నారు. ఇక ప్రకాష్ రాజ్ శ్రీరాముడిపై చేసినట్లు ఆరోపిస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ (VHP) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హిందూ సమాజానికి ప్రకాష్ రాజ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వస్తున్నా.. అందరి లెక్క తేలుస్తా అని వివరణ ఇచ్చారు.
To all of the determined bigots #justasking pic.twitter.com/zGLpbEOcYp
— Prakash Raj (@prakashraaj) April 19, 2026
