బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, తారక్ వంటి స్టార్ హీరోలతో జతకట్టి అప్పట్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్ కూడా స్టార్ట్ చేసిన ఈ హాట్ బ్యూటీ చివరగా ‘గదర్ 2’తో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రజంట్ ఆమె అక్షయ్ ఖన్నా, బాబీ డియోల్లతో కలిసి ‘హమ్ రాజ్’ (2002) సీక్వెల్లో నటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు సినిమాలకంటే ఎక్కువగా తన మాటలతో ఎక్కువగా వార్తలో నిలుస్తు ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా నేటి తరం హీరోయిన్లు, పరిశ్రమలో పెరుగుతున్న ‘ఫేక్ పీఆర్’ సంస్కృతిపై సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు.
‘బాక్సాఫీస్ వద్ద సరైన ప్రభావం చూపని వారు కూడా తమను తాము సూపర్ స్టార్లమని ప్రచారం చేసుకుంటున్నారు. ముఖ్యంగా, పీఆర్ టీమ్స్కు డబ్బులు చెల్లించి నంబర్ 1, నంబర్ 2 అని పిలిపించుకున్నంత మాత్రాన ఎవరూ స్టార్లు అయిపోరు. 2026 నాటి పరిస్థితుల ప్రకారం 100 కోట్లు అనేది పెద్ద లెక్క కాదు, కనీసం 200 కోట్ల వసూళ్లు సాధించిన ఒక్క సినిమా కూడా కెరీర్లో లేని నటీమణులు తమను తాము స్టార్లమని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. నా కెరీర్లో ‘కహో నా ప్యార్ హై’, ‘గదర్’, ‘గదర్ 2’ వంటి భారీ బ్లాక్బస్టర్లు ఉన్నాయి, అవి నాతో నటించిన హీరోల కెరీర్లోనే అతిపెద్ద విజయాలు’ అని కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడింది. అంతే కాదు
మరోవైపు, అమీషా పటేల్ తన సూపర్ హిట్ ఫ్రాంచైజీ ‘గదర్ 3’ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రం ఖచ్చితంగా వస్తుందని, దీనికి 500 కోట్లు అనేది కేవలం కనీస వసూళ్లు మాత్రమేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దీంతో పాటు నెగటివ్ యూట్యూబర్లు తమను విమర్శించడం వల్లే వారి కడుపు నిండుతోందని, అటువంటి వారిని చూసి జాలిపడాలి తప్ప బాధపడకూడదని హితవు పలికారు.
