దర్శకుడు త్రినాథరావు నక్కిన ఇంట విషాధం నెలకొంది. ఆయన తండ్రి సూర్యారావు అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో చిత్ర పరిశ్రమలోని పలువురు ఆయనకు సానుభూతి తెలియజేస్తూ సూర్యారావుకు సంతాపం చెబుతున్నారు. అనకాపల్లి త్రినాథరావు సొంతూరు. హీరో సందీప్ కిషన్ తో పాటు నిర్మాత రాజేశ్ దండ తదితరులు అనకాపల్లి వెళ్లి త్రినాథరావు కుటుంబ సభ్యులను ఓదార్చారు.

త్రినాథరావు నక్కిన ధమాకా సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నారు. సొంత్ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి సినిమాలు నిర్మిస్తున్నారు. హీరోయిజం ఉన్న ఎంటర్ టైన్ మెంట్ కమర్షియల్ సినిమాలు రూపొందించడంలో త్రినాథరావు నక్కిన టాలీవుడ్ లో గుర్తింపు పొందారు.