హనుమాన్ పాన్ ఇండియా సక్సెస్ తో స్టార్ హీరోల దగ్గర కావాల్సినంత క్రెడబిలిటీ సంపాదించుకున్నారు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన ఇప్పుడు బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్ తో ఓ సినిమాకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాకు రాక్షస అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు.

సూపర్ హీరో కథతో హనుమాన్ ను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ..ఇప్పుడు మరో విభిన్నమైన కథాంశంతో రాక్షస సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. స్వాతంత్య్రం రాకముందు ఇండియాలో జరిగే కథతో ఈ సినిమా ఉండనుంది. జై హనుమాన్ కంటే ముందే రన్వీర్ సింగ్ మూవీని లాంఛ్ చేయబోతున్నారట.