Tue. Apr 21st, 2026

టాలీవుడ్‌లో దర్శకుడు హరీష్ శంకర్ మరియు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ల మధ్య మంచి బాండింగ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’, ‘దువ్వాడ జగన్నాథమ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో వీరిద్దరూ టాలీవుడ్‌లో ఒక సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే, వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలు ఇప్పుడు నిజమనిపిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, దేవి శ్రీ ప్రసాద్ తన ఎక్స్ అకౌంట్‌లో హరీష్ శంకర్‌ను అన్‌ఫాలో చేశాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హరీష్ శంకర్ పుట్టినరోజు నాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రీసెంట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో తలెత్తిన సమస్యలే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ సినిమా పాటలకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో, హరీష్ శంకర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం థమన్‌ను సంప్రదించడం ఈ వివాదానికి దారితీసినట్లు టాక్.

సినిమా ప్రమోషన్స్ సమయంలో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. డీఎస్పీ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్లే బిజీఎం కోసం థమన్‌ను తీసుకున్నట్లు వివరణ ఇచ్చాడు. అయినప్పటికీ, డీఎస్పీ అన్‌ఫాలో చేయడం ద్వారా తమ మధ్య గ్యాప్ వచ్చిందని పరోక్షంగా స్పష్టం చేశాడు. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్న ఈ క్రేజీ జోడీ, ఇప్పుడు ఇలా విడిపోవడం మెగా అభిమానులను మరియు సంగీత ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

The submit ఉస్తాద్ భగత్ సింగ్ ఎఫెక్ట్.. హరీష్ శంకర్‌ను అన్‌ఫాలో చేసిన దేవిశ్రీ ప్రసాద్ first gave the impression on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Scores.