Tue. Apr 21st, 2026

హీరో శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ఐతే, ఈ సినిమాలో హీరోయిన్‌ గా పూజా హెగ్డేను ఫిక్స్ చేసినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు మరో పేరు వినిపిస్తోంది. హీరోయిన్ మమితా బైజును ఫైనల్ చేసే ఆలోచనలో టీమ్ ఉందని తెలుస్తోంది. మరి ఈ వార్త నిజం అయితే.. పూజా హెగ్డే సినిమా మమితా బైజుకి వెళ్ళిపోయినట్టే. ఇక మరోవైపు శర్వానంద్ ఇప్పటికే ఈ సినిమా కోసం తన లుక్ పై కసరత్తులు చేస్తున్నాడు. బైకర్ కోసం సన్నబడ్డ శర్వా.. ఈ సినిమా కోసం కొంచెం వెయిట్ పెరగబోతున్నాడు.

ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. మరి శర్వానంద్ కి శ్రీనువైట్ల ఎలాంటి హిట్ ఇవ్వబోతున్నాడో చూడాలి.

The submit పూజా హెగ్డే ప్లేస్ లో మమితా బైజు ? first seemed on Newest Telugu Film Information, Opinions, OTT, OTT Opinions, Rankings.