SS Rajamouli: టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరుదైన మ్యూజికల్ ఫాంటసీ చిత్రం ‘సింగ్ గీతం’ (Sing Geetham). ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి ఫిల్మ్స్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి.
బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే చిత్ర యూనిట్కు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ‘సింగ్ గీతం’ సినిమాకు సంబంధించిన మొదటి టికెట్ను ఆన్లైన్లో స్వయంగా ఆయనే కొనుగోలు చేశారు. నిజానికి నాగ్ అశ్విన్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్లు రాజమౌళికి వీడియో కాల్ చేసి బుకింగ్స్ ఓపెన్ చేయించాలని ప్లాన్ చేయగా.. అప్పటికే జక్కన్న టికెట్ బుక్ చేసేసుకోవడం విశేషం. సింగీతం శ్రీనివాసరావు విజన్పై తనకున్న అపారమైన గౌరవాన్ని రాజమౌళి ఈ విధంగా చాటుకున్నారు. ఈ క్రేజీ మూమెంట్కు సంబంధించిన వీడియోను వైజయంతి ఫిల్మ్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. “ఏమైంది ఏమైంది… టికెట్ బుకింగ్ ఓపెన్ అయింది!!!” అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ సినిమాకు రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజికల్ స్కోర్ అందించారు. రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగి తొలి టికెట్ కొనుగోలు చేయడంతో ‘సింగ్ గీతం’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.
Emaindhi Emaindhi…?
Price tag Reserving Open Ayindhi!!! #SSRforSSR @ssrajamouli garu surprises the #SingGeetham Group by way of buying the first actual price ticket.Seize your tickets now! https://t.co/5jNXDIFfAv
In cinemas international from June twelfth. #SingeethamSrinivasaRao… pic.twitter.com/EHuDz31Y0d
— Swapna Cinema (@SwapnaCinema) June 10, 2026
